రాష్ట్రంలో కొత్తగా మరో 249 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-01-17T09:56:55+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా మరో 249 కరోనా కేసులు
హైదరాబాద్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మరో 249 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2,91,367కు పెరిగింది. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1575కు చేరింది. శుక్రవారం మరో 417 మంది డిశ్చార్జి కాగా, కోలుకున్న వారి సంఖ్య 2,85,519కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 4,273 యాక్టివ్ కేసులు ఉన్నాయి.