తెలంగాణలో 25 వేలు దాటిన కరోనా కేసులు.. తాజాగా 11 మంది మృతి

ABN , First Publish Date - 2020-07-07T03:18:49+05:30 IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. దీంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత వారంగా...

తెలంగాణలో 25 వేలు దాటిన కరోనా కేసులు.. తాజాగా 11 మంది మృతి

హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. దీంతో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత వారంగా ఈ సంఖ్య మరింత తీవ్రమైంది. సోమవారం ఒక్కరోజే 1,831 కేసులు నమోదు కాగా 11 మృతి చెందారు. ఇప్పటివరకూ అన్ని జిల్లాల్లో 25,733 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 306 మంది చనిపోయారు. ఇంకా 10,646 కేసులు యాక్టివ్ ఉన్నాయి. కరోనా సోకి చికిత్స పొంది తాజాగా 2,078 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 14,781 మంది డిశ్చార్జి అయ్యారు. 


జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,419 మందికి పాజిటివ్ రాగా రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117, సంగారెడ్డిలో 3,  కరీంనగర్‌లో 5,  మహబూబ్ నగర్‌లో 9, గద్వాల్‌లో 1, నల్గొండలో 9, వరంగల్ అర్బన్‌లో 9, నిజామాబాద్ లో 9, వికారాబాద్‌లో 7, మెదక్‌లో 20, నారాయణపేట్‌లో 1, పెద్దపల్లిలో 9, యాదాద్రిలో 1, సూర్యాపేటలో 6, మంచిర్యాలలో 20, ఖమ్మంలో 20, జగిత్యాలలో 4, మహబూబాబాద్‌లో ఒక్క కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 






Updated Date - 2020-07-07T03:18:49+05:30 IST