11 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-06-25T05:54:23+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో పీహెచసీలు, యూపీ హెచసీలు, ఖమ్మం ప్రధా

11 మందికి కరోనా పాజిటివ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, జూన24: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో పీహెచసీలు, యూపీ హెచసీలు, ఖమ్మం ప్రధాన ఆస్పత్రి, కొవిడ్‌ పరీక్ష కేంద్రాల్లో 599 మందికి కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి,  భద్రాద్రి జిల్లాలో నిర్వహించిన  టెస్టుల్లో అన్నపురెడ్డిపల్లిలో ఒకరికి, కొత్తగూడెంలో ముగ్గురికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి.

పెంట్లంలో  కలకలం

అన్నపురెడ్డిపల్లి: మండల పరిధిలోని పెంట్లం గ్రామంలో కరోన కేసులు వెలుగు చూడటంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  శుక్రవారం యర్రగుంట ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన టెస్టుల్లో పెంట్లం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోన సోకినట్లు వైద్యాదికారి ప్రియాంక తెలిపారు.  కాగా ఇప్పటికే కరోన లక్షణాలున్న కొంత మంది మెడికల్‌ షాపుల నుంచి మందులు తెచ్చుకొని వినియోగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

Updated Date - 2022-06-25T05:54:23+05:30 IST