76 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-10-30T07:30:45+05:30 IST
జిల్లాలో గురు, శుక్రవారాల మధ్య 24 గంటల్లో 76 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
తిరుపతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల మధ్య 24 గంటల్లో 76 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. గడిచిన 48 గంటలుగా జిల్లాలో కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు. కొత్తగా గుర్తించిన కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 246804కు చేరాయి. శుక్రవారం ఉదయానికి జిల్లాలో 889 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నట్టు ప్రభుత్వ అధికారిక బులెటిన్ ప్రకటించింది.