ఎంపీ బీబీ పాటిల్కు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-10-23T11:36:42+05:30 IST
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్కు కరో నా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ‘ఆఽంధ్రజ్యోతి’తో ఆయన గురువారం తెలిపారు.
కామారెడ్డి, అక్టోబరు 22: జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ‘ఆఽంధ్రజ్యోతి’తో ఆయన గురువారం తెలిపారు. గత వారం రోజులుగా తనతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయినవారు హోం ఐసో లేషన్లో ఉండి లక్షణాలు ఉన్నవారు కొవిడ్ పరీక్ష చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ బీబీపాటిల్ కోరారు. తాను క్షేమంగానే ఉన్నానని వైద్యుల సల హా మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే నియోజకవర్గంలోని ప్రజలను కలుస్తానని తెలిపారు.