సైనిక పాఠశాలలో 13 మంది విద్యార్థులకు Corona positive‌

ABN , First Publish Date - 2021-11-01T16:39:07+05:30 IST

ఉడుమలై సైనిక పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఉడుమలై సమీపం అమ రావతి నగర్‌లోని సైనిక పాఠశాలలో 750 మంది విద్యార్థులు చదువుకుం

సైనిక పాఠశాలలో 13 మంది విద్యార్థులకు Corona positive‌

చెన్నై/పెరంబూర్‌ : ఉడుమలై సైనిక పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఉడుమలై సమీపం అమ రావతి నగర్‌లోని సైనిక పాఠశాలలో 750 మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. ఈ పాఠశాలలో చదువుకుంటున్న పలు రాష్ట్రాలకు చెందిన 10, 12 తరగతుల విద్యార్థులకు గత 40 రోజులుగా ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 95 మంది విద్యార్థులు పాఠశాలలో ఉంటు న్నారు. వీరిలో 13 మంది విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారిని ఉడుమలై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో, పాఠశాలలోని మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందజేసినట్టు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2021-11-01T16:39:07+05:30 IST