తెలంగాణలో 45,567 మందికి కరోనా లక్షణాలు
ABN , First Publish Date - 2022-01-22T19:44:51+05:30 IST
తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 45,567 మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు.
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 45,567 మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్స్ను అందజేశారు. సర్వేలో చిన్నారులు, పెద్దవారి వివరాలు విడివిడిగా సేకరిస్తున్నారు. ఎక్కువ శాతం పెద్దవారిలోనే కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. తీవ్ర కరోనా లక్షణాలుంటే వైద్య సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తోంది.