కేరళను కుదిపేస్తున్న కరోనా
ABN , First Publish Date - 2021-08-05T17:40:05+05:30 IST
మహారాష్ట్రలో కాస్త నెమ్మదించిన వైరస్ ఉధృతి.. కేరళలో ఇప్పుడు విశ్వరూపం చూపుతోంది.
తిరువనంతపురం: కేరళను కరోనా కుదిపేస్తోంది. మహారాష్ట్రలో కాస్త నెమ్మదించిన వైరస్ ఉధృతి.. కేరళలో ఇప్పుడు విశ్వరూపం చూపుతోంది. కోవిడ్ మరణాల్లో కూడా కేరళ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముందుంది. గత వారం రోజుల్లో జనాభా ప్రాతిపదికన అత్యధిక మరణాలు అక్కడే సంభవించాయి. జులై 25.. 31 తేదీల మధ్య 10 లక్షల జనాభాకు గానూ కేరళలో 24 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దేశంలోనే ఇవే అత్యధికం. 10 లక్షల జనాభాకు వారంలో 12 మరణాలతో రెండో స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. 9 మరణాలతో ఒడిశా మూడో స్థానంలో ఉంది. దేశంలో సగటున వారంలో 10 లక్షల మందికిగానూ రెండు మరణాలు సంభవించాయి.