మళ్లీ 1051 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-04-18T07:13:31+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రెండో రోజూ వెయ్యి కేసులు దాటాయి.

మళ్లీ 1051 మందికి కరోనా

వైరస్‌తో నలుగురి మృతి

7 వేలు దాటిన యాక్టివ్‌ కేసులు 


తిరుపతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రెండో రోజూ వెయ్యి కేసులు దాటాయి. శుక్ర, శనివారాల నడుమ 1051 మందికి కరోనా సోకగా వైరస్‌ బారిన పడి నలుగురు మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 99083కు, మరణాల సంఖ్య 913కు చేరాయి. యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా మరింత పెరిగి 7155కు చేరుకున్నాయి. తాజాగా గుర్తించిన కేసులు.. తిరుపతి నగరంలో 338, తిరుపతి రూరల్‌లో 153, చిత్తూరులో 53, మదనపల్లెలో 44, పీలేరులో 27, శ్రీకాళహస్తిలో 26, రేణిగుంటలో 20, పుత్తూరులో 19, చంద్రగిరి, కేవీబీపురాల్లో 17 వంతున, సోమలలో 16, గంగవరం, గుడుపల్లె, కుప్పం మండలాల్లో 13 వంతున, రామచంద్రాపురం, వెదురుకుప్పం, ఏర్పేడు మండలాల్లో 12 వంతున, చిన్నగొట్టిగల్లు, పాకాల, వి.కోట మండలాల్లో 11 వంతున, కలికిరి, పుంగనూరుల్లో 10 వంతున, జీడీనెల్లూరు, కలకడ, కార్వేటినగరం, పూతలపట్టుల్లో 9 వంతున, బంగారుపాలెం, సదుం, వడమాలపేట మండలాల్లో 8 వంతున, నగరి, నారాయణవనం, పలమనేరు, పెనుమూరు, రొంపిచెర్ల మండలాల్లో 7 వంతున, చౌడేపల్లె, ములకలచెరువు, రామకుప్పం, శ్రీరంగరాజపురం, తొట్టంబేడు, ఎర్రావారిపాలెం మండలాల్లో 6 వంతున, రామసముద్రం, తవణంపల్లె మండలాల్లో 5 వంతున, బి.కొత్తకోట, నిమ్మనపల్లె, పులిచెర్ల, వాల్మీకిపురం, యాదమరి మండలాల్లో 4 వంతున, గుర్రంకొండ, కురబలకోట, నిండ్ర, పెద్దమండ్యం, పెద్దపంజాణి మండలాల్లో 3 వంతున, బైరెడ్డిపల్లె, గుడిపాల, ఐరాల, కేవీపల్లె, నాగలాపురం, పిచ్చాటూరు, తంబళ్లపల్లె మండలాల్లో 2 చొప్పున, శాంతిపురం, వరదయ్యపాలెం, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-04-18T07:13:31+05:30 IST