1,498 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-05-07T04:30:18+05:30 IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గురువారం 1498 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.
మహబూబ్నగర్, మే 6: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గురువారం 1498 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. చికిత్స పొందుతూ వనపర్తి జిల్లాలో ఒకరు, నాగర్కర్నూలు జిల్లాలో పది మంది మృతి చెందారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 260 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని గద్వాల పట్టణం, ధరూర్, మల్దకల్ మండలాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వనపర్తి జిల్లాలోని 12 కేంద్రాల్లో 833 మందికి పరీక్షలు నిర్వహించగా 278 మందికి నిర్ధారణ అయ్యింది. అమరచింతకు చెందిన 32 సంవత్సరాల యువకుడు మహబూబ్నగర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నాగర్కర్నూలు జిల్లాలో 1651 మందికి పరీక్షలు నిర్వహించగా 621 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. చికిత్సపొందుతూ పది మంది మృతి చెందారు.
నారాయణపేట జిల్లాలో 810 పరీక్షలు చేయగా 124 కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 1650 పరీక్షలు చేయగా 215 కేసులు నమోదయ్యాయి.