కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
ABN , First Publish Date - 2020-07-14T10:32:01+05:30 IST
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని కాంగ్రె్సపార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్
నల్లగొండ టౌన్ / దేవరకొండ / మిర్యాలగూడ టౌన్, జూలై 13 : కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని కాంగ్రె్సపార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పెరిక వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రె్స పార్టీ ఎస్సీ సెల్ ఆఽధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో సోమవారం ఒక్కరోజు నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, బుర్రి శ్రీనివా్సరెడ్డి మద్దతు తెలిపారు.
దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ఆంగోతు విజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవరకొండలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు దేవరకొండ మునిసిపల్ కార్యాలయ అధికారిని కలిసి వినతిపత్రం అందించారు. మిర్యాలగూడ పట్టణంలో కరోనా కట్టడి చర్యలు విస్తృతపర్చాలని టీడీపీ పట్టణ అఽధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండారెడ్డి, శ్రీనివాస్ కోరారు.