Corona Vaccination: ఒకే వ్యక్తికి నాలుగుసార్లు కరోనా టీకా... తరువాత?
ABN , First Publish Date - 2021-08-02T15:48:00+05:30 IST
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు...
పట్నా: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో బీహార్ లో జరుగుతున్న టీకాలు వేసే ప్రక్రియలో ఘోర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. ఈ ఉదంతం భోజ్పూర్ జిల్లాలోని సహార్ ప్రాంతంలో జరిగింది. ఒక వృద్ధునికి ఏకంగా నాలుగు డోసుల కరోనా టీకా వేశారు. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో స్థానిక ఆరోగ్యవిభాగంలో కలకలం చెలరేగింది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
కాలోడీహరీ గ్రామానికి చెందిన రామ్దురారీసింగ్(76)కు నాలుగు డోసుల టీకా వేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రామ్దులార్సింగ్కు ఫిబ్రవరి 23న ఆమ్హరూవా ఆరోగ్యకేంద్రంలో మొదటి డోసు టీకా వేశారు. ఏప్రిల్ 18న రెండవ డోసు టీకా వేశారు. అయితే ఆ తరువాత మార్చి 23న ఆ వృద్ధుడు సహార్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లగా, మరోమారు టీకా వేశారు. తిరిగి జూన్ 16న కూడా ఇంకో డోసు టీకా వేశారు. ఇలా మొత్తం నాలుగుసార్లు ఆ వృద్ధుడు కోవిడ్ టీకా వేయించుకున్నాడు. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.