రాష్ట్రానికి కొత్తగా మరో 5 లక్షల 76 వేల డోసులు
ABN , First Publish Date - 2021-08-27T04:03:06+05:30 IST
రాష్ట్రానికి కొత్తగా మరో 5 లక్షల 76 వేల
కృష్ణా: రాష్ట్రానికి కొత్తగా మరో 5 లక్షల 76 వేల డోసుల కొవిడ్ టీకాలు వచ్చాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 5 లక్షల 76 వేల కోవిషీల్డ్ డోసులు రాష్ట్రానికి చేరాయి. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి మరో లక్ష కొవాగ్జిన్ డోసులు రానున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ తరలిస్తారు. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో ఆయా జిల్లాలకు వ్యాక్సిన్లు తరలి వెళ్లనున్నాయి. నూతన టీకాల రాకతో రాష్ట్రంలో నెలకొన్న కొవిడ్ వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలుగనుంది.