కరోనా.. అయితే ఏంటి !

ABN , First Publish Date - 2020-07-06T11:49:57+05:30 IST

రోజురోజుకీ కరోనా వైరస్‌ విజృంభిస్తూ పాజిటివ్‌ కేసులు పెరగడమే కాకుండా మృతుల సంఖ్య పెరు గుతున్నప్పటికీ ..

కరోనా.. అయితే ఏంటి !

ఏలూరు ఫైర్‌స్టేషన్‌: రోజురోజుకీ కరోనా వైరస్‌ విజృంభిస్తూ పాజిటివ్‌ కేసులు పెరగడమే కాకుండా మృతుల సంఖ్య పెరు గుతున్నప్పటికీ ప్రజల్లో ఎలాంటి భయం లేక పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం వచ్చిం దంటే చాలు చేపలు, మాంసం దుకాణాల ముందు కరోనా వైరస్‌ బలాదూర్‌ అన్నట్టుగా బారులు దీరుతున్నారు. భౌతిక దూరం సంగతి మర్చి పోతున్నారు. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌ రోడ్డు పైనే చేపలు, మటన్‌, కూరగాయలు విక్రయి స్తు న్నారు. వాస్తవానికి రైతు బజారు ఏఎస్‌ఆర్‌ స్టేడి యంలో నిర్వహిస్తున్నారు. వర్షానికి నీళ్లు స్టేడియం లోకి రావడంతో రైతులంతా రోడ్లపైనే షాపులు నిర్వహిం చారు. దీంతో అటు కూరగాయలకు వచ్చే జనాలు, ఇటు మాంసం ప్రియులతో ఆ బజారంతా కిటకిట లాడింది. అధికారులెవరు కనబడక పోవడం విశేషం.   

Updated Date - 2020-07-06T11:49:57+05:30 IST