కరోనా చికిత్సను ఈహెచ్ఎస్లో చేర్చాలి
ABN , First Publish Date - 2020-07-07T08:01:00+05:30 IST
కరోనా చికిత్సను ఈహెచ్ఎస్లో చేర్చాలి
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోందని, ప్రధానంగా వయోధికులు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా చికిత్సను ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎ్స)లో చేర్చాలని జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య, ఆర్థిక కార్యదర్శి ఎస్.జ్ఞానేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.