వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
ABN , First Publish Date - 2022-07-02T06:48:58+05:30 IST
మండల కేంద్రంలోని పాత చిలుకూరులోని కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభ వంగా నిర్వహించారు.
చిలుకూరు, జూలై 1: మండల కేంద్రంలోని పాత చిలుకూరులోని కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభ వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో అర్చకుడు అనంత కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కడియాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.