కరోనా ఉపశమనం: కొత్త రోగుల కన్నా కోలుకుంటున్నవారే అధికం!

ABN , First Publish Date - 2020-09-23T17:06:33+05:30 IST

దేశంలో కరోనా వైరస్ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 56 లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 83,527 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదువుతున్న కేసుల కన్నా...

కరోనా ఉపశమనం: కొత్త రోగుల కన్నా కోలుకుంటున్నవారే అధికం!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 56 లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 83,527 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదువుతున్న కేసుల కన్నా, వ్యాధి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. వరుసగా ఐదవరోజు ఈ విధంగా జరిగింది. 



దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 56,46,010కు చేరింది. వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 45 లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో మొత్తం 1,085 మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఈ వ్యాధి కారణంగా దేశంలో ఇప్పటివరకూ మొత్తం 90,020 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో ఈ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 89,746గా ఉంది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 45,87,613గా నమోదయ్యింది. దేశంలో కరోనా రికవరీ రేటు 81.25 శాతంగా ఉంది. 

Updated Date - 2020-09-23T17:06:33+05:30 IST