దేశంలో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్... ఇప్పటివరకూ ఎంతమందికి టీకాలు వేశారంటే...

ABN , First Publish Date - 2021-09-04T13:17:38+05:30 IST

దేశంలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది.

దేశంలో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్... ఇప్పటివరకూ ఎంతమందికి టీకాలు వేశారంటే...

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా పరిస్థితులు దడ పుట్టిస్తున్నాయి. దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ వేగవంతం చేశారు. శుక్రవారం నాటికి దేశంలో మొత్తం 67.65 కోట్ల మందికిపైగా ప్రజలకు టీకాలు వేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని తెలిపింది. గడచిన 24 గంటల్లో మొత్తం 51,88,894 మందికి టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ మూడవ దశ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ  అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు కలిగిన 26,66,03,686 మందికి తొలి డోసు టీకా వేశారు. అలాగే 3,20,41,597 మందికి రెండవ డోసు టీకా వేశారు. కాగా కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళలో లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖండించారు. లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వారు తెలిపారు. 


Updated Date - 2021-09-04T13:17:38+05:30 IST