నమస్కారం పెట్టలేదని రేషన్‌ డ్రైవర్‌పై కార్పొరేటర్‌ దాడి

ABN , First Publish Date - 2022-07-01T06:51:28+05:30 IST

తమకు నమస్కారం పెట్టలేదని రేషన్‌ వాహనం డ్రైవర్‌పై వైసీపీ కార్పోరేటర్‌, ఆమె భర్త దాడికి దిగిన ఘటన 45వ డివిజన్‌ కొత్తపేట లో గురువారం రాత్రి జరిగింది.

నమస్కారం పెట్టలేదని రేషన్‌ డ్రైవర్‌పై కార్పొరేటర్‌ దాడి

ఏలూరు రూరల్‌ జూన్‌ 30 : తమకు నమస్కారం పెట్టలేదని రేషన్‌ వాహనం డ్రైవర్‌పై వైసీపీ కార్పోరేటర్‌, ఆమె భర్త దాడికి దిగిన ఘటన 45వ డివిజన్‌ కొత్తపేట లో గురువారం రాత్రి జరిగింది. బాధితుడు పాకిన శ్రీని వాస్‌ చెప్పిన వివరాలివి.. శుక్రవారం నుంచి రేషన్‌ పంపి ణీకి డిపో నుంచి బియ్యం తీసుకువస్తుండగా అటు వెళు తున్న డివిజన్‌ కార్పొరేటర్‌ స్రవంతి, ఆమె భర్త నాగ రాజు ఎదరయ్యారు. వచ్చి వెళ్లేటప్పుడు తమకు నమ స్కారం పెట్టకుండా సీరియస్‌గా చూస్తున్నావేంటి అం టూ  అతనితో గొడవకు దిగి అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. దీంతో చేపలతూము సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. మూకుమ్మడిగా దాడి చేయడంతో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-07-01T06:51:28+05:30 IST