రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-02-22T01:47:14+05:30 IST

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది: సోము వీర్రాజు

అనకాపల్లి: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి ఉపాధి హామీ పథకం నిధులు కేంద్రం భారీగా కేటాయించిందని తెలిపారు. దేశ బడ్జెట్‌లో రూ.70 వేల కోట్లు చూపించగా, అందులో రూ.12 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కే ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ఇసుక, సిమెంటు ధరలు భారీగా పెరిగిపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు రూ.12 వేల కోట్లు ఇచ్చినప్పటికీ పూర్తిచేయలేకపోతున్నారని సోము వీర్రాజు విమర్శించారు. 

Updated Date - 2022-02-22T01:47:14+05:30 IST