ఏపీలో దళితులపై లెక్కలేనన్ని దాడులు : శ్రావణ్ కుమార్

ABN , First Publish Date - 2022-07-02T22:42:56+05:30 IST

అమరావతి: ఏపీలో దళితులు, బహుజనులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ ఆరోపించారు. నెల్లిమర్లలో దళితులు కులాంతర వివాహం చేసుకుంటే

ఏపీలో దళితులపై  లెక్కలేనన్ని దాడులు : శ్రావణ్ కుమార్

అమరావతి: ఏపీలో దళితులు, బహుజనులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు,  హైకోర్టు న్యాయవాది  శ్రావణ్ కుమార్ ఆరోపించారు. నెల్లిమర్లలో దళితులు కులాంతర వివాహం చేసుకుంటే జీరించుకోలేని అగ్రవర్ణాలు దాడులకు తెగబడ్డాయని, దళితులు వివక్షతకు గురవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. 

పోలీసులు తీరును హైకోర్టులో ఫైల్ చేస్తా..

‘‘23 కేసులు, రౌడీషీట్ ఉన్నఎమ్మెల్సీ అనంత్ బాబు బెయిల్ కోసం అప్లయ్ చేసుకుంటే.. ఆయన సచ్చీలుడని పోలీసులు అఫిడవిట్ ధాఖలు చేస్తారా? పోలీసులు తీరును హైకోర్టులో ఫైల్ చేస్తా. దళితులపై దాడులు, దౌర్జన్యాలను జై భీమ్ భారత్ పార్టీ చూస్తూ ఊరుకోదు.  కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంలో కూడా రాజకీయం చేసిన నీచమైన వ్యక్తి జగన్. దళితులపై దాడులకు తెగబడుతున్న జగన్ ప్రభుత్వానికి దళితులు, బహుజనులను ఓటు అడిగే నైతిక హక్కు లేదు. మా దళిత బిడ్డల ప్రాణాలు, మానాలు లెక్కలేదా? జగన్ ప్రభుత్వం దళితులను చంపి, డోర్ డెలివరీ చేసే స్థాయికి చేరింది. జగన్ ధమనకాండపై దళితులు, బహుజనులు, మైనారిటీలు ఆలోచన చేయాలి. దళితులు ప్రతిఘటించలేరనా?ప్రశ్నించలేరనా? రానున్న రోజుల్లో దళితులు, బహుజనులు జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.  

Updated Date - 2022-07-02T22:42:56+05:30 IST