దేశ అభివృద్ధి ప్రదాత నెహ్రూ

ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST

దేశ అభివృద్ధి ప్రదాత నెహ్రూ

దేశ అభివృద్ధి ప్రదాత నెహ్రూ
ఘట్‌కేసర్‌ : నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులుర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఘట్‌కేసర్‌/మేడ్చల్‌ అర్బన్‌, మే 27 : దేశానికి మొదటి ప్రధానిగా చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ దేశ అభివృద్ధి ప్రధాత అన్ని చౌదరిగూడ ఎంపీటీసీ పులకంటి భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామంలోని వెంకట్రాద్రి టౌన్‌షి్‌పలో నిర్వహించిన నెహ్రూ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట ఈంజనేయులుగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పల్లె బాబురావు, అనిల్‌గౌడ్‌, బోజిరెడ్డి, నర్సింగ్‌రావు, దావిద్‌రెడ్డి, వెంకటేష్‌, శ్రవణ్‌, వినోద్‌, క్రాంతి స్వామి, భరత్‌ తధితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు నరసింహులుయాదవ్‌ ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన పీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ దేశానికి ఎంతగానో సేవ చేశారన్నారు. కార్యక్రమంలో మేడ్చల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ బి-బ్లాక్‌ అధ్యక్షుడు సింగరేణి పోచయ్య, వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, శామీర్‌పేట మండలం అధ్యక్షుడు శంకర్‌గౌడ్‌, తూంకుంటు మున్సిపాలిటీ అద్యక్షుడు జైపాల్‌రెడ్డి, నాయకులు వేముల మహే్‌షగౌడ్‌, గరిశల సరేందర్‌ముదిరాజ్‌, గువ్వ రవి ముదిరాజ్‌, గౌడవెల్లి బాల్‌రెడ్డి, మేడ్చల్‌, శామీర్‌పేట, మూడుచింతలపల్లి, తూంకుంట మున్సిపాలిటీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:30:00+05:30 IST