ప్రాణాలు తీసిన ఎడబాటు..! దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-04T15:02:20+05:30 IST

వృద్ధాప్యంలో వీడి ఉండడం ఇష్టం లేని ఆ దంపతులిద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మైలాడుదురై జిల్లా శీర్గాళి సమీపం పెరుతోట్టంకు చెందిన చేపల వ్యాపారి

ప్రాణాలు తీసిన ఎడబాటు..! దంపతుల ఆత్మహత్య

చెన్నై: వృద్ధాప్యంలో వీడి ఉండడం ఇష్టం లేని ఆ దంపతులిద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మైలాడుదురై జిల్లా శీర్గాళి సమీపం పెరుతోట్టంకు చెందిన చేపల వ్యాపారి ముల్లర్‌ అరుళ్‌స్వామి (73), భాగ్యవతి (65) దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులకు వివాహమై చెన్నైలో ఉంటుండగా, కుమార్తె కూడా భర్తతో వేరే ఊరిలో ఉంటుంది. కొంతకాలం క్రితం భాగ్యవతికి అనారోగ్యంగా ఉండడంతో కుమారులు చెన్నైకి తీసుకొచ్చి వైద్య చికిత్స అందించి ఊరికి పంపారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి దంపతులిద్దరూ విషం తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డారు. గమనించిన పక్క గదిలో పడుకున్న అల్లుడు శశి వారిని వెంటనే శీర్గాళి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2020-07-04T15:02:20+05:30 IST