మరణంలోనూ ఒక్కటిగా...

ABN , First Publish Date - 2021-03-06T05:13:04+05:30 IST

మరణంలోనూ ఒక్కటిగా...

మరణంలోనూ ఒక్కటిగా...
మృతిచెందిన జగన్‌, జీజా దంపతులు

భర్త హఠాన్మరణం.. తట్టుకోలేక భార్య మృతి

వర్ధన్నపేట, మార్చి 5: కలిసి ఏడడుగులు వేశా రు.. కష్టాసుఖాల్లోనూ ఒకరికొకరుగా తోడుగా నిలిచా రు.. భర్త మృతి తట్టుకోలే క తను కూడా తుదిశ్వాస విడిచింది. వివరాల్లోకి వెళి తే వర్ధన్నపేట శివారు తాళ్లకుంటతండాకు చెందిన వాం కుడోత్‌ జగన్‌(70), భార్య జీజా (65) భార్యాభర్తలు. వీరి కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా వారి కి వివాహాలయ్యాయి. జగన్‌ తనకున్న కొద్దిపాటు భూమి లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం జగన్‌ హఠాన్మరణం చెందగా, భర్త మృతదేహంపై రోది స్తూ.. జీజా కొద్దిసేపటికే స్ప్పహ కోల్పోయింది. వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉం డడంతో ఎంజీఎంకు తరలించగా అప్పటికే మృతి చెందిం ది. జగన్‌, జీజా మృతదేహాలను ఇంటి వద్ద వేయడం అందరిని కంటతడి పెట్టించింది. 50 ఏళ్లకుపైగా కలిసి ఉంటూ ఒకరిఒకరు తోడుగా ఉంటూ కొన్ని గంటల తేడా తో దంపతులు మృతిచెందడంతో తండావాసులను కన్నీరుమున్నీరయ్యారు.


Updated Date - 2021-03-06T05:13:04+05:30 IST