రోడ్డుపై ఆడుకుంటూ పక్కింట్లోకి వెళ్లిన పిల్లలు.. తలుపు సందులోంచి ఓ బాలిక లోపలికి చూస్తే షాకింగ్ సీన్!

ABN , First Publish Date - 2022-02-17T21:04:39+05:30 IST

స్నేహితులతో ఆడుకుంటూ కొందరు పిల్లలు పక్కింట్లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ చిన్నారి తలుపు సందులోంచి ఆ ఇంట్లోకి తొంగి చూసింది. అనంతరం ఆ ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి ఆ చిన్నారి నివ్వెరపోయిం

రోడ్డుపై ఆడుకుంటూ పక్కింట్లోకి వెళ్లిన పిల్లలు.. తలుపు సందులోంచి ఓ బాలిక లోపలికి చూస్తే షాకింగ్ సీన్!

ఇంటర్నెట్ డెస్క్: స్నేహితులతో ఆడుకుంటూ కొందరు పిల్లలు పక్కింట్లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ చిన్నారి తలుపు సందులోంచి ఆ ఇంట్లోకి తొంగి చూసింది. అనంతరం ఆ ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి ఆ చిన్నారి నివ్వెరపోయింది. ఆ తర్వాత వెంటనే పరిగెత్తికెళ్లి ఇంట్లో తాను చూసిన దృశ్యం గురించి స్థానికులకు చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున జనం అక్కడకు పరుగులు తీశారు. చత్తీస్‌గడ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన సత్య(25), సీమా(23) ప్రేమించుకున్నారు. మూడేళ్ల క్రితం ఇరువురూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కొండగావ్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే నివసిస్తున్నారు. సత్య స్థానికంగా దొరికే పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. సీమా మాత్రం ఇంటి దగ్గరే ఉండేది. ఈ క్రమంలో ఎప్పటిలాగే మంగళవారం సత్య పనికి వెళ్లిపోయాడు. సీమా ఒక్కతే ఇంట్లో ఉంది. భర్త పనికి వెళ్లిన తర్వాత సీమా దారుణానికి పాల్పడింది. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పక్కింటి అమ్మాయి తన స్నేహితులతో ఆడుకుంటూ.. సీమా ఇంట్లోకి తొంగి చూసింది. ఈ క్రమంలో ఆమె విగత జీవిగా వేలాడుతున్న దృశ్యం చూసి షాకైంది. వెంటనే విషయాన్ని స్థానికులకు తెలిజేసింది. దీంతో అక్కడకు చేరుకున్న స్థానికులు.. విషయాన్ని సత్యకు చేరవేశారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న సత్య.. సీమాను ఆసుపత్రికి తరలించాడు. అయితే అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు సీమా అప్పటికే చనిపోయినట్టు వెల్లడించారు. 



ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ఆసుపత్రికి చేరుకున్నారు. సీమా ఆత్మహత్య గురించి సత్యను విచారించారు. అయితే అతడు మాత్రం నోరు మెదపలేదు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి అకస్మాత్తుగా సత్య కూడా అదృశ్యం అయ్యాడు. దీంతో పోలీసులు అతడి గురించి గాలించారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం(బుధవారం) ఇంటి వద్ద ఉన్న చెట్టుకు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సత్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని మరణించడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇరువురి మధ్య గొడవలు కూడా ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. పెళ్లై మూడేళ్లైన పిల్లలు పుట్టలేదనే బాధతో సీమా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే భార్య మృతిని తట్టుకోలేక సత్య కూడా ప్రాణాలు వదిలి ఉంటాడని భావిస్తున్నారు. అయితే, భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.




Updated Date - 2022-02-17T21:04:39+05:30 IST