రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

ABN , First Publish Date - 2021-04-23T06:35:17+05:30 IST

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన కార్వేటినగరం మండలంలో గురువారం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
వేలాయుధం, రాజేశ్వరి (ఫైల్‌ ఫొటో)

వెదురుకుప్పం, ఏప్రిల్‌ 22: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన కార్వేటినగరం మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్లాగుంట గ్రామానికి చెందిన   రాజేశ్వరి(70), వేలాయుధం(72) దంపతులు బ్యాంకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో కార్వేటినగరం వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. చిత్తూరు-పుత్తూరు రహదారిలోని కొల్లాగుంట  సమీపంలో వెనుక వైపు వస్తున్న కోళ్ల వ్యాన్‌ మోపెడ్‌లో వస్తున్న దంపతులను ఢీకొనడంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. భర్త వేలాయుధం తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతికి రుయాస్పత్రికి తరలించారు. రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.గురువారం సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తయి రాజేశ్వరి  మృతదేహం కొల్లాగుంటకు చేరింది.రుయాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చిన వేలాయుధం  గురువారం సాయంత్రం కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇద్దరి అంత్యక్రియలు శుక్రవారం కొల్లాగుంటలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. రాజేశ్వరి కుమారుడు యువరాజు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మనోహర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-23T06:35:17+05:30 IST