ప్రేమజంట ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-07T06:50:09+05:30 IST

అరుణానది ఒడ్డున ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కులాలు వేరు కావడంతో కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకోలేదు.దీంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి పరారైన ప్రేమికులు బుధవారం సాయంత్రం అప్పలరాజుకండ్రిగ గ్రామ సమీపంలో అరుణానది ఒడ్డున ఉరి వేసుకుని కన్పించడంతో రెండు కుటుంబాలూ శోకసముద్రంలో మునిగిపోయాయి.

ప్రేమజంట ఆత్మహత్య

కులాలు వేరంటూ పెళ్లికి పెద్దల అడ్డు


పిచ్చాటూరు, జూలై 6: అరుణానది ఒడ్డున ఓ   ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.పోలీసుల కథనం మేరకు....పిచ్చాటూరు మండలం  అడవికొడియంబేడు అరుంధతివాడకు చెందిన గుర్రప్ప(25), అడవి శంకరాపురం దళితవాడకు చెందిన పల్లవి(18) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.కులాలు వేరు కావడంతో కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకోలేదు.దీంతో ఇద్దరూ పారిపోయినప్పటికీ అమ్మాయికి మైనారిటీ  తీరకపోవడంతో పోలీసు కేసు పెట్టి తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకున్నారు.అనంతరం ఆ అమ్మాయిని తమిళనాడులో అవ్వగారి ఇంట ఉంచారు. అయితే ఇటీవల తమ్ముడు చనిపోవడంతో ఇంటికి వచ్చిన పల్లవి ఇక్కడే ఉంటోంది. గుర్రప్పతో మళ్లీ మాట్లాడుతుండడం గమనించిన ఇరు కుటుంబాల వారూ పెళ్లి కుదరదంటూ భయపెట్టారు. దీంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి పరారైన ప్రేమికులు బుధవారం సాయంత్రం అప్పలరాజుకండ్రిగ గ్రామ సమీపంలో అరుణానది ఒడ్డున ఉరి వేసుకుని కన్పించడంతో రెండు కుటుంబాలూ శోకసముద్రంలో మునిగిపోయాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-07T06:50:09+05:30 IST