758 కేసులు
ABN , First Publish Date - 2021-04-21T05:35:56+05:30 IST
జిల్లాలో గత 24 గంటల్లో 3,123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 758 మందికి వైరస్ సోకింది.
ఇద్దరి మృతి
కర్నూలు(హాస్పిటల్),
ఏప్రిల్ 20: జిల్లాలో గత 24 గంటల్లో 3,123 మందికి కరోనా పరీక్షలు
నిర్వహించగా 758 మందికి వైరస్ సోకింది. జిల్లాలో పాజిటివ్ రేటు 25 శాతంగా
ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కర్నూలు నగరంతో పాటు మండలాల్లో వైరస్
విజృంభిస్తోంది. జిల్లాలో యాక్టివ్ కేసులు 4,243కు చేరుకున్నాయి. జిల్లాలో
కేసుల సంఖ్య 67,317కు చేరగా.. ఇద్దరు కొవిడ్తో చికిత్స పొందుతూ మృతి
చెందారు. కర్నూలు నగరంలో 317 మందికి అత్యధికంగా వైరస్ సోకగా.. ఆదోనిలో 57,
ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 42, నందికొట్కూరు మున్సిపాలిటీలో 34 అత్యధికంగా
కేసులు వెలుగు చూశాయి. కర్నూలు రూరల్ పరిధిలో 27, బేతంచెర్లలో 22,
దేవనకొండలో 20, ఆత్మకూరు మున్సిపాలిటీలో 16, జూపాడుబంగ్లాలో 16, కోడుమూరులో
10, వెల్దుర్తిలో 10, ప్యాపిలిలో 14, డోన్ మున్సిపాలిటీలో 11,
చిప్పగిరిలో 11, పాములపాడులో 9, కల్లూరులో 9, క్రిష్ణగిరిలో 6, గోనెగండ్లలో
6, నందవరంలో 6, మిడ్తూరులో 3, గూడూరు మున్సిపాలిటీలో 3 కేసులు నమోదయ్యాయి.
నంద్యాల డివిజన్లో 84 పాజిటివ్ కేసులు వచ్చాయి.