ఆగిరిపల్లిలో ఇద్దరికి కరోనా
ABN , First Publish Date - 2021-04-21T06:20:59+05:30 IST
ఆగిరిపల్లిలో కరోనా ఉధృతి పెరుగుతోంది.
ఆగిరిపల్లి : ఆగిరిపల్లిలో కరోనా ఉధృతి పెరుగుతోంది. మంగళవారం తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆగిరిపల్లి కొలెం బజారులో ఒకరికి మరో వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ కాగా ఓ వ్యక్తికి తీవ్రమైన లక్షణాలు ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు ప్రసాద్బాబు తెలిపారు. మరో పాజిటివ్ సోకిన వ్యక్తిని హోమ్ ఐసోలేషన్లో ఉంచామన్నారు. ఆగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 56 మంది ఫ్రంట్లైన్ వారియర్స్కు కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు.
ఉపాధ్యాయుడికీ..
వత్సవాయి : మండలంలోని ఎంపీయూపి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడికి కరోనా నిర్ధారణ కావటంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందు తున్నారు. విద్యార్ధుల అందరికి కరోనా పరీక్షలు చేయించాలని మండల బీజేపీ అధ్యక్షుడు దామాల ప్రసాద్ కోరారు.