146 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-02T06:36:20+05:30 IST
జిల్లాలో కరోనావ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో రోజురోజుకూ పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నట్టుగానే కనిపిస్తోంది.
190 మంది డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
జిల్లాలో కరోనావ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో రోజురోజుకూ పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నట్టుగానే కనిపిస్తోంది. జిల్లాలో కరోనా అలజడి మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ మరణాలు చోటుచేసుకుంటుండగా.. మంగళవారం కరోనా మరణం ఒక్కటి కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. అయితే గడచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 146 పాజిటివ్ కేసులు కొత్తగా వెలుగు చూశాయి. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 45,558కి చేరుకున్నాయి. మరణాలు అధికారికంగా 637 వద్ద నిలకడగానే ఉన్నాయి. అదే సమయంలో కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 190 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 1,263 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.