జిల్లాలో 16 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-03-06T06:20:45+05:30 IST
జిల్లాలో శుక్రవారం కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూ రు నగరంలో 5, మంగళగిరిలో 2 , అచ్చంపేట, ముప్పాళ్ల, తాడేపల్లి, కారంపూడి, పిడుగురాళ్ల, బాపట్ల, తెనాలి, చుండూరు, వేమూరులో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
గుంటూరు(మెడికల్), మార్చి 5: జిల్లాలో శుక్రవారం కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూ రు నగరంలో 5, మంగళగిరిలో 2 , అచ్చంపేట, ముప్పాళ్ల, తాడేపల్లి, కారంపూడి, పిడుగురాళ్ల, బాపట్ల, తెనాలి, చుండూరు, వేమూరులో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
2048 మందికి వ్యాక్సిన్
55 కేంద్రాల్లో శుక్రవారం 2048 మంది తొలి విడత కొవిడ్-19 వ్యా క్సిన్ పొందారు. ఆరోగ్య సిబ్బంది 1053 మంది, 60 ఏళ్లుపైబడిన వృద్ధు లు, 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు 995 మంది ఉన్నారు. తొలి విడత వ్యాక్సినేషన్ పొందిన వారి సంఖ్య 59,575కు చేరింది. 40 కేంద్రాల్లో 699 మంది రెండో డోస్ వ్యాక్సిన్ పొందారు. రెండో విడత టీకా పొందిన వారి సంఖ్య 12,783కి చేరింది. జేసీ ప్రశాంతి శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నాట్కో సెంటర్లో రెండో విడత వ్యాక్సిన్ తీసుకున్నారు.
====================================================================