కరోనాతో 26 మంది మృతి
ABN , First Publish Date - 2021-05-11T17:27:17+05:30 IST
జిల్లాలో సోమవారం ఒక్కరోజే 26 మంది కొవిడ్ బాధితులు మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 934కు చేరిందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 973 కేసులు నమోదుకాగా,
బళ్లారి: జిల్లాలో సోమవారం ఒక్కరోజే 26 మంది కొవిడ్ బాధితులు మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 934కు చేరిందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 973 కేసులు నమోదుకాగా, 459 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. బళ్లారి తాలూకాలో 359, సండూరులో 152, సిరుగుప్ప 60, కూడ్లిగి 13, హడగళి 48, హోస్పేట 118, హగరి బొమ్మనళ్లి 57, హరప్పనహళ్లి 161 మంది కరోనా బారినపడ్డారన్నారు.
రాయచూరులో ముగ్గురి మృతి
రాయచూరు: జిల్లాలో సోమవారం ముగ్గురు కరోనా బాధితులు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 196కు చేరినట్లు కలెక్టర్ వెంకటేశ్ కుమార్ తెలిపారు. తాజాగా 582 మంది కొవిడ్ బారిన పడ్డారని, 527 మంది డిశ్చార్జ్ అయ్యారని, 582 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు.