మరింత తగ్గిన Covid యాక్టివ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-02-24T16:41:26+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. బుధవారం 667 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ ప్రబలగా బెంగళూరులో 368 మంది ఉన్నారు. బాగల్కోటె, బీదర్‌లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. 14 జిల్లాల్లో

మరింత తగ్గిన Covid యాక్టివ్‌ కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. బుధవారం 667 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ ప్రబలగా బెంగళూరులో 368 మంది ఉన్నారు. బాగల్కోటె, బీదర్‌లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. 14 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో 30లోపు నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. 1674 మంది డిశ్చార్జ్‌ కాగా 21 మంది మృతిచెందారు. బెంగళూరులో 15 మంది, చిత్రదుర్గలో ఇద్దరు, నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,378 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 4,759మంది ఉన్నారు. 

Updated Date - 2022-02-24T16:41:26+05:30 IST