భారీగా తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు
ABN , First Publish Date - 2021-10-12T17:44:36+05:30 IST
రాష్ట్రంలో రెండోవిడత కొవిడ్ ప్ర బలిన తర్వాత తొలిసారి యాక్టివ్కేసులు 10వేలలోపు చేరాయి. 30 జిల్లాల్లో 9,906 మంది చికిత్స పొందుతున్నారు. ఏడు నెలల్లో ఇంత తక్కువకు చేరడం ఇదే ప్రథ
బెంగళూరు: రాష్ట్రంలో రెండోవిడత కొవిడ్ ప్ర బలిన తర్వాత తొలిసారి యాక్టివ్కేసులు 10వేలలోపు చేరాయి. 30 జిల్లాల్లో 9,906 మంది చికిత్స పొందుతున్నారు. ఏడు నెలల్లో ఇంత తక్కువకు చేరడం ఇదే ప్రథమం. సోమవారం 373 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 146 మంది, మైసూరులో 43 మంది, దక్షిణకన్నడ, హాసన్లలో 38 మంది చొ ప్పున పాజిటివ్ ప్రబలింది. ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 611 మంది డిశ్చార్జ్ కాగా పదిమంది మృతి చెందారు. బెంగళూరులో ఐదుగురు, మైసూరు, ఉత్తరకన్నడలో ఇరువురు చొప్పున, ధార్వాడలో ఒకరు మృతి చెందారు.