కొవిడ్తో అప్రమత్తంగా వ్యవహరించాలి
ABN , First Publish Date - 2021-05-09T05:47:09+05:30 IST
రోజురోజుకూ ప్రబలుతున్న కరోనాతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్ఆదిత్య సూచిం చారు.
అడ్డతీగల, మే 8: రోజురోజుకూ ప్రబలుతున్న కరోనాతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్ఆదిత్య సూచిం చారు. శనివారం ఆయన అడ్డతీగల వైటీసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు, సిబ్బందికి సూచనలిచ్చారు. 20 నుంచి 25 కేసులు నమోదయ్యే పంచాయతీలలో పూర్తి లాక్డౌన్ ప్రకటించాలని ఆయా పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకాపై అవగాహన ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాపన్నదొర, తహశీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.