6 వేల పడకలతో మూడు కొవిడ్ కేర్ కేంద్రాలు
ABN , First Publish Date - 2021-05-05T05:52:50+05:30 IST
జేఎన్టీయూకే, మే 4: జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేవిధంగా మూడు కొవిడ్ కేర్ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. కాకినాడ జేఎన్టీయూలో మంగళవారం ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రా
జేఎన్టీయూకేలో వెయ్యి పడకల సెంటర్ను
ప్రారంభించిన కలెక్టర్ మురళీధర్రెడ్డి
జేఎన్టీయూకే, మే 4: జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేవిధంగా మూడు కొవిడ్ కేర్ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. కాకినాడ జేఎన్టీయూలో మంగళవారం ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి నటరాజ్, నాగార్జున వసతిగృహాల బ్లాక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బొమ్మూరు, బోడసకుర్రులలో 5 వేల పడకలతో కొవిడ్ కేర్ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. జేఎన్టీయూకేలో వెయ్యి పడకలతో ఇప్పటి నుంచి కొవిడ్ సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ కీర్తి, కాకినాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఎంహెచ్వో గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.