పది జిల్లాల్లో జీరో Covid కేసులు
ABN , First Publish Date - 2021-10-22T17:39:44+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో తగ్గుతుండగా బెంగళూరులో మాత్రం నిలకడగా సాగుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 365 మందికి పాజిటివ్ నిర్దారణ కాగా పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు
బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో తగ్గుతుండగా బెంగళూరులో మాత్రం నిలకడగా సాగుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 365 మందికి పాజిటివ్ నిర్దారణ కాగా పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 12 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో అత్యధికంగా 210 మంది దక్షిణ కన్నడ, హాసన్లలో 33 మందికి చొప్పున పాజిటివ్ నిర్దారణ కాగా ఐదు జిల్లాల్లో 20 లోపు కేసులు నమోదయ్యాయి. 443 మంది కోలుకోగా ఎనిమిది మంది మృతిచెందారు. వీరిలో బెంగళూరులో నలుగురు కాగా మిగిలిన నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. 25 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. సుదీర్ఘకాలం తర్వాత 30 జిల్లాల్లో యాక్టివ్ కేసులు 9 వేల లోపుకు చేరాయి. 8,988 మంది చికిత్స పొందుతున్నారు.