24 జిల్లాల్లో Covid కేసులు సాధారణం
ABN , First Publish Date - 2021-12-03T17:33:46+05:30 IST
రాష్ట్రంలో ఆరు జిల్లాలోనే కొవిడ్ కేసులు ప్రభావం చూపుతున్నాయి.గురువారం రాష్ట్రవ్యాప్తంగా 363 మందికి పా జిటివ్ నిర్ధారణ కాగా ఇందులో బెంగళూరులో 206 మందికి సోకగా ఉత్తరకన్నడలో 22, దక్షిణకన్నడలో
బెంగళూరు: రాష్ట్రంలో ఆరు జిల్లాలోనే కొవిడ్ కేసులు ప్రభావం చూపుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 363 మందికి పా జిటివ్ నిర్ధారణ కాగా ఇందులో బెంగళూరులో 206 మందికి సోకగా ఉత్తరకన్నడలో 22, దక్షిణకన్నడలో 20, మైసూరులో 19, చామరాజనగర్లో 12, ఉడుపిలో పదిమందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఏడు జిల్లాలలో ఒక కేసు నమోదు కాలేదు. 17 జిల్లాలో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 191 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందగా వీరిలో బెంగళూరుకు చెందినవారు ఇరువురు కాగా హాసన్లో ఒకరున్నారు. 30 జిల్లాలో 6,743 మంది చికిత్స పొందుతున్నారు.