21 జిల్లాల్లో తగ్గిన covid cases
ABN , First Publish Date - 2021-10-14T17:14:34+05:30 IST
రాష్ట్రంలో 21 జిల్లాల్లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం 357 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 140మందికి వైరస్ ప్రబలింది. ఐదు జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు.
బెంగళూరు: రాష్ట్రంలో 21 జిల్లాల్లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం 357 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 140మందికి వైరస్ ప్రబలింది. ఐదు జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 17 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 7జిల్లాల్లో 40మంది లోపు బాధితులు నమోదయ్యారు. 438 మంది కోలుకోగా పది మంది మృతి చెందారు. బెంగళూరులో ఐదుగురు మృతి చెందగా మరో ఐదు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. 30 జిల్లాల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 9,621 మంది చికిత్స పొందుతున్నారు.