ఐదింట నిల్.. 15 జిల్లాల్లో పదిలోపు covid కేసులు
ABN , First Publish Date - 2021-10-20T16:36:28+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడ గా కొనసాగుతున్నాయి. మంగళవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 349 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదు జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 15 జిల్లాల్లో పదిమందిలోపు
బెంగళూరు(karnataka): రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడ గా కొనసాగుతున్నాయి. మంగళవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 349 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదు జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 15 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరులో 161 మంది, మైసూరులో 37, దక్షిణకన్నడ 24, హాసన్లో 23మందికి వైరస్ సోకింది. మిగిలిన జిల్లాల్లో 10-20 మధ్య బాధితులు నమోదయ్యారు. 399 మంది కోలుకోగా 14 మంది మృతిచెందారు. బెంగళూరులో ఐదుగురు, ఉడుపిలో ముగ్గురు, ఆరు జిల్లాల్లో తలా ఒక్కరు కన్నుమూశారు. ప్రస్తుతం 9,100మంది చికిత్సలు పొందుతున్నారు.