Covid ప్రభావం బెంగళూరులోనే కేంద్రీకృతం
ABN , First Publish Date - 2021-12-27T17:22:16+05:30 IST
కొవిడ్ ప్రభావం బెంగళూరులోనే కేంద్రీకృతమైంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 348 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 248 మందికి వైరస్ సోకింది. 11 జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. 15 జిల్లాల్లో
బెంగళూరు: కొవిడ్ ప్రభావం బెంగళూరులోనే కేంద్రీకృతమైంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 348 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 248 మందికి వైరస్ సోకింది. 11 జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. 15 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. కొడుగులో 18 మంది తుమకూరు, ఉత్తరకన్నడ జిల్లాలో 11 మంది చొప్పున నమోదయ్యారు. 198 మంది కోలుకోగా ముగ్గురు మృతిచెందారు. బెంగళూరులో ఇద్దరు చామరాజనగర్లో ఒకరు మృతిచెందారు. మిగిలిన 28 జిల్లాలో ఒక్కరూ మృతి చెందలేదు. మొత్తం 7,418ల మంది చికిత్స పొందుతున్నారు.