బెంగళూరులో తగ్గని Covid ఉధృతి
ABN , First Publish Date - 2022-01-22T16:39:29+05:30 IST
రాజధాని బెంగళూరులో కొవిడ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 48,049మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 29,068మంది ఉన్నారు. తుమకూరులో 2021,
బెంగళూరు: రాజధాని బెంగళూరులో కొవిడ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 48,049మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 29,068మంది ఉన్నారు. తుమకూరులో 2021, హా సన్లో 1889, మండ్యలో 1506, కల్బుర్గి 1164, బెంగళూరు గ్రామీణ 1036, ఉడుపి 1018, మైసూరు 915, దక్షిణకన్నడలో 897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ వందల్లో కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,115 మంది డిశ్చార్జ్ అయ్యారు. 22 మంది మృతిచెందగా బెంగళూరులో ఆరుగురు, ఉడుపిలో నలుగురు, మైసూరులో ముగ్గురు, హావేరిలో ఇద్దరు, ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో మృతులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,23,143 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 2,23,580 మంది ఉన్నారు.