Indiaలో కొత్తగా 3714 కొవిడ్ కేసులు... ఏడు మరణాలు

ABN , First Publish Date - 2022-06-07T15:35:41+05:30 IST

దేశంలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3714 కొత్త కేసులు నమోదు అవగా... ఏడుగురు మృతి చెందారు.

Indiaలో కొత్తగా 3714 కొవిడ్ కేసులు... ఏడు మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3714 కొత్త కేసులు నమోదు అవగా... ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 26,976 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,31,85,049 కేసులు నమోదు అవగా... 5,24,708 మరణాలు సంభవించాయి. అలాగే కరోనా రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది.  నిన్న 2513 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,26,33,365 మంది కోలుకున్నారు. 


మరోవైపు భారత్‌లో 508 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 194.27 కోట్ల డోసుల టీకాలను అందజేశారు. నిన్న 13,96,169 డోసుల టీకాల పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 194,27,16,543 డోసుల టీకాలను అందజేశారు. 

Updated Date - 2022-06-07T15:35:41+05:30 IST