34 కేసులు.. ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-11-27T06:38:52+05:30 IST
జిల్లాలో మరో కరోనా బాధితుడు శుక్రవారం మరణించాడు.
విజయవాడ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో కరోనా బాధితుడు శుక్రవారం మరణించాడు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 34 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,20,138కు చేరగా, మరణాలు 1,454కు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,18,268 మంది కోలుకున్నారు. ఇంకా 416 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.