కరోనా కేసులు 803
ABN , First Publish Date - 2022-01-27T06:56:07+05:30 IST
జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.
ఆసుపత్రుల్లో 5,600 మంది
విజయవాడ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 748 మందికి వైరస్ సోకగా, బుధవారం కొత్తగా మరో 803 మంది వైరస్ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,819కి చేరింది. మరణాల సంఖ్య 1,482 వద్ద నిలకడగా ఉంది. జిల్లాలో వైరస్ బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,19,737 మంది కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల్లో 5,600 మంది చికిత్స పొందుతున్నారు. హోం ఐసొలేషన్లో ఉన్న బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుందని భావిస్తున్నారు.
శాయుపురంలో కరోనా కలకలం
శాయిపురం (ఉయ్యూరు), జనవరి 26 : ఉయ్యూరు మండలం శాయిపురం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంగళవారం కరోనా టెస్ట్ చేయగా, ప్రధానోపాధ్యాయునితో పాటు మరో ఉపాధ్యాయుడికి, ఆరుగురు విద్యార్థులకు, మధ్యాహ్న భోజన ఏజెన్సీకి చెందిన మరో మహిళకు కరోనా పాజిటివ్గా బుధవారం నిర్ధారణయింది. దీనితో సర్పంచ్ జాన్బాషా పాఠశాల ఆవరణను శానిటైజ్ చేయించి, గ్రామంలో బ్లీచింగ్, స్ర్పేయింగ్ చేయించారు.