పాఠశాలల్లో డబుల్ సెంచరీ దాటిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-19T05:12:14+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ పాఠ శాలల్లో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య డబుల్ సెంచరీని దాటింది.
ఏలూరుఎడ్యుకేషన్, సెప్టెంబరు 18 : జిల్లాలోని ప్రభుత్వ పాఠ శాలల్లో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య డబుల్ సెంచరీని దాటింది. శనివారం వెల్లడైన కొవిడ్ పరీక్ష ఫలితాల్లో అక్కిరెడ్డి గూడెం, కె.ఎన్.వి.గూడెం, రామన్నగూడెం, సాదనాల వారి మెరక పాఠశాలల్లో నలుగురు టీచర్లకు, నాగిరెడ్డిగూడెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, కలవలపల్లి జడ్పీ హైస్కూల్లలో ఇద్దరు విద్యార్థులకు కరో నా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీటితో జిల్లాలో గత ఆగస్టు 16న పాఠశాలలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 205 మంది విద్యార్థులు, టీచర్లకు కొవిడ్ సోకినట్టు అయ్యింది.