భారత్‌లో విజృంభిస్తున్న కొవిడ్.. దాదాపు లక్షన్నర కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-01-08T15:21:25+05:30 IST

భారత్‌లో రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దేశంలో కొత్తగా దాదాపు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,41,986 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో విజృంభిస్తున్న కొవిడ్.. దాదాపు లక్షన్నర కేసులు నమోదు

ఢిల్లీ : భారత్‌లో రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దేశంలో కొత్తగా దాదాపు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,41,986 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే 21.3 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,53,68,372కి చేరింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాలు మహారాష్ట్రలో 40,925, పశ్చిమ బెంగాల్‌లో 18,213 కేసులు, ఢిల్లీలో 17,335 కేసులు, తమిళనాడులో 8,981 కేసులు, కర్ణాటకలో 8,449 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 285 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,463కి చేరినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Updated Date - 2022-01-08T15:21:25+05:30 IST