విస్తరిస్తున్న కొవిడ్‌ వైరస్‌

ABN , First Publish Date - 2022-06-29T06:22:01+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ మరోమారు శరవేగంగా విస్తరిస్తోంది.

విస్తరిస్తున్న కొవిడ్‌ వైరస్‌

కొత్తగా 51 కేసులు నమోదు

పాజిటివిటీ రేటు శరవేగంగా పెరుగుతుండంతో వైద్యుల్లో ఆందోళన


విశాఖపట్నం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి):


జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ మరోమారు శరవేగంగా విస్తరిస్తోంది. మంగళవారం 292 మందికి పరీక్షలు నిర్వహించగా 51 మంది (పాజిటివిటీ రేటు 17ు)కి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీటితో ఉమ్మడి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,92,097కు చేరింది. ఇందులో 1,90,635 మంది కోలుకోగా, మరో 234 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ బారినపడి 1,153 మంది మృతిచెందారు. పాజిటివిటీ రేటు భారీగా నమోదుకావడం పట్ల వైద్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.

Updated Date - 2022-06-29T06:22:01+05:30 IST