కరోనాతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-11T04:15:10+05:30 IST

మండలంలోని పాతపాడు గ్రామానికి చెందిన యువకుడు (28) కరోనాతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలలో చికిత్స పొందు తూ సోమవారం ఉదయం మృతిచెందాడు.

కరోనాతో యువకుడి మృతి

చేజర్ల, మే 10: మండలంలోని పాతపాడు గ్రామానికి చెందిన యువకుడు (28) కరోనాతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలలో చికిత్స పొందు తూ సోమవారం ఉదయం మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆ యువకుడు పొదలకూరు పరిసర ప్రాంతాలలో వ్యాపారం చేసుకునే వాడు. వారంరోజుల క్రితం పొదలకూరులోని ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించ గా కరోనా పాజిటివ్‌ రావడంతో పాతపాడు వచ్చాడు. ఒకరోజు తర్వాత  108 వాహనంలో వెళ్లి ఆత్మకూరు ప్రభుత్వ వెద్యశాలలో చేరాడు. ఆదివారం కూడా గ్రామస్థులు, కుటుంబసభ్యులతో మాట్లాడాడు. సోమవారం ఉదయం చనిపోయినట్లు సమాచారం ఇచ్చా రని  కుటుంబసభ్యుల కన్నీరు మున్నీరవుతున్నారు.  

Updated Date - 2021-05-11T04:15:10+05:30 IST