కొవిడ్‌పై జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-08T06:34:25+05:30 IST

కొవిడ్‌ పరిస్థితులపై జిల్లా స్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కొవిడ్‌పై జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు

 డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 7: కొవిడ్‌ పరిస్థితులపై జిల్లా స్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ జీవో నంబరు 206 జారీ చేసింది. కమిటీలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌, మంత్రులు, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మున్సిపల్‌ చైర్మన్‌లు ఉంటారు. మెంబర్‌ కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. ఈ కమిటీ జిల్లా లో కొవిడ్‌ పరిస్దితులు, వైద్య సేవలపై ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు సేకరించి నిర్ణయాలు తీసుకుంటారు.

Updated Date - 2021-05-08T06:34:25+05:30 IST